Tuesday, March 8, 2016

అసహనం

ఈమధ్య ప్రతి వాళ్ళకీ ఈపదం వాడడంఅలవాటైపోయింది.మాట్లాడితే దేశం విడిచి పోతాం అని బెదిరిస్తున్నారు.మాతృభూమి అంటే ఏమిటో వీళ్ళకి తెలియడంలేదు.పక్కింట్లో పరవాన్నం ఎంత బాగున్నా మన గంజినీళ్ళు మన స్వంతం.దేశం మనకేమిచ్చింది అంటున్నారు కానీ మనం దేశానికి ఏమిచ్చాం అని ఆలోచించడం లేదు.యూనివర్శిటీలు రాజకీయవేదికలైపోయాయి.కులసంఘాలు విద్యార్ధి జీవితాలతో బంతాట ఆడుకొంటున్నాయ్.ప్రొఫెసర్లు విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు.రాజకీయనాయకులు కుళ్ళు
పెంచుతున్నారు.మళ్ళీ ఏ మహాత్ముడో పుట్టాలి.మన దేశాన్ని రక్షించాలి.